HomeAndhra PradeshTTD:టీటీడీ కొత్త చర్యలు ఫలిస్తాయా...?

TTD:టీటీడీ కొత్త చర్యలు ఫలిస్తాయా…?

Published on

spot_img

రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కొత్త చర్యలు చేపడుతోంది. సాంకేతిక వినియోగమే ఉత్తమమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్‌తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వారం, పది రోజుల్లో టీటీడీ-గూగుల్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. తర్వాత గూగుల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తిచేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి.

గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పలుచోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరినీ అడగకుండా ఫోన్‌ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు. ఫోన్‌లకే నోటిఫికేషన్లు వస్తాయి. దీనివల్ల టీటీడీకీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది…. కానీ భక్తులకు స్మార్ట్ ఫోన్ అనుమతించకపోతే…. ఏఐ(గూగుల్) సేవలు ఏలా.. వినియోగించుకుంటారు అన్నది కొసమెరుపు. ఒక వేళ అనుమతిస్తే..అది మరో సమస్యకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. మరి టీటీడీ కొత్త చర్యలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...