HomeCrimeVIJAYASHANTI: రాములమ్మ దంపతులకు బెదిరింపులు

VIJAYASHANTI: రాములమ్మ దంపతులకు బెదిరింపులు

Published on

spot_img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల క్రితం చంద్రకిరణ్‌రెడ్డి తమను సంప్రదించి, సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేటర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి వద్ద సోషల్‌మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు.

చంద్రకిరణ్‌రెడ్డి మాతో కలిసి పనిచేస్తూ …తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారు. స్వలాభం కోసం మా పేరును వాడుకున్నారు. అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్‌ సేవలను వినియోగించుకోలేదు. మేం భాజపాలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడింది. ఆ పార్టీలో ఎదిగేందుకు చంద్రకిరణ్‌ మమ్మల్ని వాడుకున్నారు. భాజపాలో నుంచి బయటకు వచ్చాక అతడి నుంచి మెసేజ్‌ వచ్చింది. పెండింగ్‌లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా… అని అందులో ఉంది.

ఈక్రమంలో…. మావద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చాం. అయితే ఏప్రిల్‌ 6న చంద్రకిరణ్‌రెడ్డి బెదిరింపు సందేశం పంపాడు. బకాయిలు తీర్చకుంటే… మీరు శత్రువులు అవుతారని మెసేజ్‌ చేశాడు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయి. చంద్రకిరణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి…. అని శ్రీనివాస ప్రసాద్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.

Latest articles

Bhu Bharathi: ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూచట్టాలను చేసింది..!

*'ధరణి' ఎన్నో సమస్యలకు కారణమైంది.. *భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం...

Dr.BR Ambedkar: బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ (Dr....

Hyderabad: జైలులోపలికి ఫోన్…ఖైదీతో మాట్లాడిన విడియో… సోషల్ మీడియాలో వైరల్ ..

హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ...

PADI KAUSHIK REDDY: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో కుంభకోణం

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది...

More like this

Bhu Bharathi: ఎంతో అధ్యయనం చేసి కాంగ్రెస్ భూచట్టాలను చేసింది..!

*'ధరణి' ఎన్నో సమస్యలకు కారణమైంది.. *భూభారతి పోర్టల్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన ధరణి చట్టం...

Dr.BR Ambedkar: బి.ఆర్.అంబేద్కర్ కు ఘన నివాళులు..

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ (Dr....

Hyderabad: జైలులోపలికి ఫోన్…ఖైదీతో మాట్లాడిన విడియో… సోషల్ మీడియాలో వైరల్ ..

హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ...