HomeBusinessGold Rates: ఒక్క రోజే వెయ్యికి పెరిగిన బంగారం ధర

Gold Rates: ఒక్క రోజే వెయ్యికి పెరిగిన బంగారం ధర

Published on

spot_img

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశీయ విఫణిలో తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్కును దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం ముగింపుతో పోల్చితే నిన్న ఒక్క రోజే ఏకంగా రూ.1000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. దీపావళి సందర్భంగా వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,400గా ఉంది. ఈసారి ధనత్రయోదశి నాడు బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరగడానికి ధరల పెరుగుదలే కారణమని అంటున్నారు. గతేడాది ఇదే సమయంలో పది గ్రాముల బంగారం ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 35 శాతం (రూ.21,200) పెరిగింది.

పుత్తడి ధరలతోపాటు పెరిగే వెండి ధరలు ఈసారి కూడా నిన్న అదే జోరు కొనసాగించాయి. కిలోపై ఒక్క రోజే రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో గత బుధవారం తొలిసారి రూ. 1.02 లక్షల మార్కును తాకింది. ఇక, గతేడాది ఇదే నెలలో కిలో వెండి రూ. 74 వేలుగా ఉంది. ఏడాదిలో రూ. 27 వేలు పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి ధరలు..

భాగ్యనగరంలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,330గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,550గా ఉంది. 18 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.61,000గా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం కొనుగోలు చేసే సమయంలో ఈ ధరల్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...