HomeTelanganaMLC Kavitha : ఏఐతో కాదు... అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

MLC Kavitha : ఏఐతో కాదు… అనుముల ఇంటెలిజెన్స్‌తోనే ప్రమాదం!

Published on

spot_img

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ప్రమాదమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, వాస్తవానికి అనుముల ఇంటెలిజెన్స్ (ఏఐ)తోనే ప్రమాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం కవిత ఇందిరాపార్కు వద్ద ఇవాళ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, అనుముల ఇంటెలిజెన్స్ అని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని మండిపడ్డారు. వారు పక్కకు తప్పుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ పని అని విమర్శించారు కవిత.

బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో కులగణన జరిగిందని, ఆ వివరాలు కూడా బహిర్గతం చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల్లా తాము ఢిల్లీలో దొంగ దీక్షలు చేయబోమని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక దీక్ష చేస్తామని ఆమె అన్నారు.

బిల్లులను ఆమోదించి నాలుగు వారాలవుతోందని, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటో చెప్పాలని కవిత నిలదీశారు. బిల్లుల ఆమోదం తర్వాత అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని చెప్పిన సీఎం… ఇప్పటి వరకు ఆ పనిచేయలేదని విమర్శించారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి స్నేహం ఉందని, అందుకే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు. ఢిల్లీ దీక్షలో రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడారని, కానీ అక్కడ దీక్ష చేస్తే కేంద్రానికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Latest articles

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

More like this

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...