HomeAndhra PradeshSUPREME COURT: రఘురామ కేసులో ప్రభావతి దర్యాప్తునకు హాజరుకావాలి: సుప్రీంకోర్టు ఆదేశం

SUPREME COURT: రఘురామ కేసులో ప్రభావతి దర్యాప్తునకు హాజరుకావాలి: సుప్రీంకోర్టు ఆదేశం

Published on

spot_img

మాజీ ఎంపీ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు పై కస్టోడియల్‌ టార్చర్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ ప్రభావతి దర్యాప్తునకు తప్పక సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైకాపా అధికారంలో ఉండగా గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఆమె పనిచేశారు. రఘురామపై కస్టోడియల్‌ టార్చర్‌లో ఎలాంటి గాయాలు కాలేదని అప్పట్లో నివేదిక ఇచ్చారు.

ఈ అంశం పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 7,8 తేదీల్లో సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని… ప్రభావతిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు చెప్పినా దర్యాప్తునకు సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఒక్కసారే విచారణకు పిలిచారని.. రెండు నెలల్లో మళ్లీ పిలవలేదని ప్రభావతి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఎప్పుడు నోటీసులు పంపినా.. ప్రభావతి తప్ప ఎవరో ఒకరు స్పందిస్తున్నారని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ప్రభావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...