కంచ గచ్చిబౌలి భూముల వివాదం బుధవారం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే…. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు తెలుపుతున్నారు.
బుధవారం ఉదయం హెచ్సీయూ క్యాంపస్ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసారు. వర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా …. విద్యార్థులను బయటకు పోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపస్లో విద్యార్థులు, ప్రొఫెసర్లు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.