HomeCrimeCrime News: ప్రియుడిపై మోజుతో పిల్లలకు విషంపెట్టి చంపిన తల్లి!

Crime News: ప్రియుడిపై మోజుతో పిల్లలకు విషంపెట్టి చంపిన తల్లి!

Published on

spot_img

* అమీన్ పూర్ లో ఓ తల్లి ఘాతుకం

* ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్న ఓ తల్లి ఆమె ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. పోలీసుల విచారణలో బయటపడిన వాస్తవాలు పరిశీలిస్తే… రాఘవేంద్ర కాలనీకి చెందిన రజిత (45) అనే మహిళకు భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలు.. సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో తన పాత స్నేహితుడితో రజితకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతే.. భర్త, పిల్లలను వదిలించుకుని ప్రియుడితో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది.

మార్చి 27వ తేదీ రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగు అన్నంలో విషం కలిపింది. అయితే, ఆ అన్నం తినకుండా భర్త వాటర్ ట్యాంకు తీసుకుని కాలనీలో వాటర్ సప్లై చేసేందుకు వెళ్లిపోయాడు.దీంతో ఆ పెరుగు అన్నం ముగ్గురు పిల్లలకు పెట్టింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త చెన్నయ్య ఇంటికి వచ్చే సరికి ముగ్గురు పిల్లలూ విగత జీవులుగా పడివున్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు.

ఈ వ్యవహారంలో మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు… మరింత లోతుగా కేసు విచారణ జరిపితే రజిత భాగోతం బయటపడింది. దీంతో రజిత ప్రియుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపేసిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది.

Latest articles

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

More like this

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...