HomeCrimeChhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్లు... 22 మంది మావోయిస్టుల మృతి!

Chhattisgarh: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్లు… 22 మంది మావోయిస్టుల మృతి!

Published on

spot_img

ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల‌ స‌రిహ‌ద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయి. బీజాపూర్, కాంకెర్ జిల్లాలో జ‌రిగిన రెండు ఎన్‌కౌంట‌ర్ల‌లో 22 మంది మావోయిస్టులతోపాటు ఓ జవాను కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

బీజాపూర్-దంతెవాడ జిల్లాల‌ స‌రిహ‌ద్దు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో గురువారం ఉద‌యం నుంచే కూంబింగ్ చేప‌ట్టాయి. ఈ క్రమంలో మావోలు ఎదురుపడి కాల్పులు జ‌రిపారు. దాంతో వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఘటనాస్థలి నుంచి 18 మంది మావోయిస్టుల‌ మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అయితే, ఈ ఎద‌రుకాల్పుల్లో ఓ జ‌వాను ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

ఇక ఇదే స‌మ‌యంలో కాంకెర్ జిల్లాలోనూ మ‌రో ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్‌, డీఆర్‌జీ బ‌ల‌గాలు సంయుక్తంగా జ‌రిపిన కూంబింగ్ ఆప‌రేష‌న్‌లో న‌లుగురు మావోయిస్టుల‌ను మ‌ట్టుబెట్టాయి. ప్ర‌స్తుతం రెండు జిల్లాల్లోనూ యాంటీ-న‌క్స‌ల్స్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుండ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

 

Latest articles

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

More like this

GURUGRAM: ఐసీయూలో ఉన్న ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి

అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఓ ఎయిర్ హోస్టెస్ కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చికిత్స అందిస్తుండగా...ఆసుపత్రి సిబ్బందిలో...

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...