HomeBusinessINDIA-US:ప్రతీకారానికి సమయమిదే: కరోలిన్‌ లీవిట్‌

INDIA-US:ప్రతీకారానికి సమయమిదే: కరోలిన్‌ లీవిట్‌

Published on

spot_img

విదేశి ఉత్పత్తులపై అధిక సుంకాల విధింపుతో ప్రతీకారానికి సిద్ధమవుతుంది అమెరికా. భారత్‌ తో సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాల ఉత్పత్తులపై సుంకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది . అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏప్రిల్‌ 2న తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. లేటెస్ట్ గా వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ మాట్లాడుతూ… అమెరికా ఉత్పత్తులపై భారత్‌ 100 శాతం సుంకాలు వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని తెలిపారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.

తమ ఉత్పత్తుల పై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను కరోలిన్‌ మీడియాకు చూపించారు. కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారిఫ్‌ల రూపంలో పీల్చేస్తున్నాయని తెలిపారు. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50శాతం సుంకాలు వసూలు చేస్తోందని తెలిపారు. అమెరికన్ల వ్యాపారాలు చాల వరకు దెబ్బతింటున్నాయి అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయం అని తెలిపారు.

వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్‌ అన్నారు. బుధవారం (ఏప్రిల్ 2)నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. పరస్పర ప్రతీకార సుంకాల విషయంలో మేం శాశ్వత నిర్ణయం తీసుకోబోతున్నామని ఇప్పటికే ట్రంప్ తెలిపారు.

ప్రతీకార సుంకాలు అన్ని దేశాలపై ఉంటాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా మేం అన్ని దేశాలతో ఉదారంగా వ్యవహరించాం. కానీ చరిత్రలో ఏ దేశాన్నీ దోచుకోని విధంగా అవి అమెరికాను దోచుకున్నాయి. వాణిజ్య పాలసీల విషయంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు.. శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తించాయి.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...