-
కూటమి ప్రభుత్వంపై రోజా విమర్శలు
-
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారని వెల్లడి
-
స్కూళ్లను కూడా ఎత్తివేస్తున్నారంటూ విమర్శలు
కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా. రాష్ట్రంలో వైద్య కళాశాలలకు మంగళం పాడేశారని, రైతు భరోసా కేంద్రాలను కూడా ఎత్తివేస్తున్నారని, ఇప్పుడు పాఠశాలల వంతు వచ్చిందని పేర్కొన్నారు. అయినా, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని మీరు ముందే చెప్పారు లెండి… తప్పు మీది కాదు, తప్పంతా ఈవీఎంలదే అని ఎద్దేవా చేశారు.
“ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా…? గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండొచ్చా…? బాగుందయ్యా బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది” అంటూ రోజా సోషల్ మీడియాలో ఆమె స్పందించారు.
మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు !
అయినా….. "విద్య ప్రభుత్వ బాధ్యత కాదు" అని ముందే మీరు చెప్పారు లెండి… తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !
ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?
గ్రామంలో ఎన్ని…
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 17, 2025