HomeTelanganaHCU: హెచ్ సీ యూ భూములు విషయంలో ...ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

HCU: హెచ్ సీ యూ భూములు విషయంలో …ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

Published on

spot_img

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా …ప్రభుత్వం ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. హెచ్ సీ యూ భూముల విషయంలో… విద్యార్థులతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుకట్టింది. అలాగే విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. వర్సిటీ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోనుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, విశ్వవిద్యాలయం అధ్యాపకసంఘం ప్రతినిధులు, సివిల్‌ సొసైటీ ప్రతినిధులతో సోమవారం మంత్రుల కమిటీ చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. బలగాల ఉపసంహరణపై వీసీ అభిప్రాయం కోరుతూ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. ఆదివారం హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు, సివిల్‌ సొసైటీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన మీనాక్షి నటరాజన్‌.. సోమవారం మంత్రుల కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి, అధ్యాపక సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్‌ భూక్యానాయక్, ప్రొఫెసర్‌ సౌమ్య దేచమ్మ, ప్రొఫెసర్‌ శ్రీపర్ణదాస్, వివిధ సంఘాల ప్రతినిధులు సంధ్య, సజయ, విస్సా కిరణ్‌కుమార్, ఇమ్రాన్‌ సిద్దిఖీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున, భూముల నేపథ్యంపై కాకుండా….. విద్యార్థులతో నెలకొన్న వివాద పరిష్కారంపై మాత్రమే చర్చించాలని నిర్ణయించారు. విద్యార్థులు, అధ్యాపకులు తన వద్ద ప్రస్తావించిన అంశాలను మీనాక్షి నటరాజన్‌ వివరించారు. దీంతో మంత్రుల కమిటీ వెంటనే నిఘా విభాగం డీజీ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తదితరులను పిలిపించి.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసు భద్రత కావాలని వర్సిటీనే కోరినందున వీసీ అభిప్రాయం తెలుసుకుని బలగాల ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

సుప్రీంకోర్టు సాధికార కమిటీ.. వర్సిటీ క్యాంపస్‌ను సందర్శించడానికి ముందే 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవవైవిధ్య సర్వే నిర్వహించడానికి నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతివ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు కోరారు. కానీ వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున న్యాయస్థానం తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఎవరినీ సర్వేకు అనుమతించలేమని… మంత్రుల కమిటీ స్పష్టంచేసింది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం.. 400 ఎకరాల భూమి పరిరక్షణకు పోలీసుల పహారా తప్పనిసరని, క్యాంపస్‌లోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న బలగాలను.. వీసీ స్పందన అనంతరం ఉపసంహరించుకుంటామంది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...