ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవమైంది. 5 స్థానాలకు మొత్తం 5 నామినేషన్లే దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రానికి ముగిసింది. దీంతో బరిలో ఉన్న నాగబాబు, బీద రవిచంద్ర, తిరుమల నాయుడు, కావలి గ్రీష్మ, సోము వీర్రాజు..ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 టీడీపీ, ఒకటి జనసేన, మరోకటి బీజేపీకి కేటాయించారు. జనసేన అభ్యర్థిగా నాగబాబు, టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు వేశారు.