HomeCrimeSUPREME COURT: శ్రవణ్‌ను అరెస్ట్ చేయొద్దు.. సుప్రీం ఆదేశం

SUPREME COURT: శ్రవణ్‌ను అరెస్ట్ చేయొద్దు.. సుప్రీం ఆదేశం

Published on

spot_img

ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు ఊరట లభించింది. విదేశాల నుంచి భారత్ వచ్చేందుకు ఆయన్ను అరెస్ట్ చేయకుండా సుప్రీం కోర్టు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు నుంచి ఊరట లభించడంతో ఈవారం చివర్లో శ్రవణ్ రావు హైదరాబాద్ రానున్నారు. పోలీసుల విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 48 గంటల్లో శ్రవణ్ రావు ఇండియాకు వస్తారని సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు కోర్టుకు తెలిపారు. శ్రవణ్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది, అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌కు సుప్రీం ఆదేశించింది. కచ్చితంగా విచారణకు హాజరుకావాల్సిందే అని స్పష్టం చేసింది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తుల అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో శ్రవణ్ రావు నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ కోసం పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించగా… జస్టిస్ బి.వి నాగరత్నతో కూడిన ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. శ్రవణ్ రావు తరపున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. శ్రవణ్‌‌ను అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని కోరగా ఈ తీర్పు వచ్చింది . శ్రవణ్ రావు 48 గంటల్లో అమెరికా నుంచి భారత్‌కు చేరుకుంటారనే విషయాన్ని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు . శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు ఇస్తారా …లేక.. విచారణకు పిలిచి అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారా …అనేది తెలియాల్సి వుంది.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...