HomeTelanganaCrime News: R.S. ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ..

Crime News: R.S. ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ..

Published on

spot_img

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఆయన ఇల్లు ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… ఎన్నికలకు ముందు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన సిర్పూర్ పర్యటనకు వస్తే ఈ ఇంట్లోనే ఉంటారు. అయితే గత రాత్రి ఆయన నివాసంలో దొంగలు పడ్డారు. రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఆ ఇంట్లోనే కొందరు బీఆర్ఎస్ నేతలు ఉంటారు. కానీ బుధవారం రాత్రి మాత్రం ఎవరూ లేరని చెబుతున్నారు. దీంతో ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. “తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్ కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోనిపోయారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా తెలంగాణ డీజీపీని కోరుతున్నాను” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.

Latest articles

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

More like this

Crime News: కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: చిలుకూరు మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి...

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...