భాజపా, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నారని…. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి వ్యతిరేకమంటూ విమర్శించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు వ్యతిరేకమని….స్వాతంత్ర్య సమరంలో ఏ మాత్రం పాలు పంచుకోని వాళ్లు.. ఇప్పుడు పటేల్ వారసులంటూ ప్రకటించుకోవడం హస్యాస్పదమని ఖర్గే అన్నారు. భాజపా- ఆర్ఎస్ఎస్ కలిసి జాతీయ నాయకులపై కుట్ర పన్నుతున్నాయని… దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా… దేశ సేవలో నిమగ్నమైందని…స్వాతంత్ర్య సమరంలో ఎంతో పోరాడిందని ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మధ్య మంచి అనుబంధం ఉండేది. ఆ నేతలిద్దరు దేశం కోసం కలిసికట్టుగా పని చేశారు. అలాంటిది.. ఆ నాయకులు ఒకరితో మరొకరు వ్యతిరేకంగా ఉండేవారని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని …. మండిపడ్డారు.
నెహ్రూ- పటేల్ మధ్య నిత్యం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. అన్ని విషయాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునే వారు. పటేల్ అంటే ఆయనకు అమితమైన గౌరవం. ఏదైనా సలహా తీసుకోవాల్సి వస్తే స్వయంగా నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారు. పటేల్ సౌలభ్యం దృష్టి ఉంచుకుని సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారు. అలాంటి గొప్ప నాయకులపై భాజపా- ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి…. అని ఆరోపించారు.