HomeCrimeCrime News: కూతురిని ప్రేమించాడని కిరాతకంగా హత్య!

Crime News: కూతురిని ప్రేమించాడని కిరాతకంగా హత్య!

Published on

spot_img

* పుట్టిన రోజు నాడే.. అమ్మాయి తండ్రి ఘాతుకం

* కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబం

తెలంగాణలో మరో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. వేరే కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించినందుకు కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడో తండ్రి. దీంతో బాధిత యువకుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేర్వేరు కావడంతో వీరి ప్రేమకు యువతి తండ్రి అభ్యంతరం చెప్పాడు. ఇక నుంచి తన కూతురితో మాట్లాడొద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు. అయినా.. అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆగ్రహంతో రగిలిపోయిన యువతి తండ్రి ఎలాగైనా సాయికుమార్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నిన్న రాత్రి (గురువారం) 10 గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో కలిసి కూర్చొని ఉండగా.. యువతి తండ్రి గొడ్డలితో వచ్చి అకస్మాత్తుగా దాడి చేశాడు. విచక్షణారహితంగా సాయికుమార్ పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సాయికుమార్ స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటీన సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు.

సాయికుమార్ మృతి వార్త పెద్దపల్లి జిల్లాతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సాయికుమార్ కుటుంబ సభ్యులు

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...