*ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్
*ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం
*పెండింగ్ వడ్డీ బకాయిల్లో 50 % రాయితీ ఇస్తూ జీవో
ఏపీలో ఆస్తి పన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ కల్పించింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, పేరుకుపోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.