ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో మృతదేహాన్ని అధికారులు గుర్తించి బయటకు తీశారు. డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
లభ్యమయిన మృతదేహం యూపీకి చెందినప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్కుమార్ దిగా అధికారులు గుర్తించారు. పోస్టమార్టం తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి పంపిచేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందిస్తామన్నారు.
కన్వేయర్ బెల్టుకు 50 మీటర్ల దూరంలో మృతుడి కాలిని గుర్తించారు. అదే ప్రాంతంలో దుర్వాసన కూడా రావడంతో డెడ్ బాడీ ఆనవాళ్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఎల్ బీసీ ఘటన జరిగి దాదాపు నెల రోజులు కావస్తుంది, కాని ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురి కోసం సహాయక బృందాలు
గాలిస్తున్నాయి.