HomeBusinessGold Rates: ఒక్క రోజే వెయ్యికి పెరిగిన బంగారం ధర

Gold Rates: ఒక్క రోజే వెయ్యికి పెరిగిన బంగారం ధర

Published on

spot_img

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దేశీయ విఫణిలో తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82 వేల మార్కును దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం ముగింపుతో పోల్చితే నిన్న ఒక్క రోజే ఏకంగా రూ.1000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. దీపావళి సందర్భంగా వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,400గా ఉంది. ఈసారి ధనత్రయోదశి నాడు బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరగడానికి ధరల పెరుగుదలే కారణమని అంటున్నారు. గతేడాది ఇదే సమయంలో పది గ్రాముల బంగారం ధర రూ. 61,200గా ఉండగా ఈసారి ఏకంగా 35 శాతం (రూ.21,200) పెరిగింది.

పుత్తడి ధరలతోపాటు పెరిగే వెండి ధరలు ఈసారి కూడా నిన్న అదే జోరు కొనసాగించాయి. కిలోపై ఒక్క రోజే రూ. 1,300 పెరిగి రూ. 1.01 లక్షలకు పెరిగింది. దేశీయ మార్కెట్‌లో గత బుధవారం తొలిసారి రూ. 1.02 లక్షల మార్కును తాకింది. ఇక, గతేడాది ఇదే నెలలో కిలో వెండి రూ. 74 వేలుగా ఉంది. ఏడాదిలో రూ. 27 వేలు పెరిగింది.

హైదరాబాద్‌లో నేటి ధరలు..

భాగ్యనగరంలో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,330గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 74,550గా ఉంది. 18 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.61,000గా నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం కొనుగోలు చేసే సమయంలో ఈ ధరల్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...