హైదరాబాద్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపాడు ఓ సైకో. ఇన్ఫోసిస్ సమీపంలోని కల్పదరు ప్రాజెక్టులో యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి రియాకుమారిపై వెస్ట్ బెంగాల్ కు చెందిన సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేశాడు. దాడి అనంతరం పారిపోతున్న క్రమంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు, స్థానికంగా ఉన్న జనాలు ఆ సైకోను పట్టుకొని చితకబాదారు, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.
సైకో దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి రియాకుమారిని తల్లిదండ్రులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల చేతిలో తన్నులు తిన్న సైకో ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో
ఇన్ఫోసిస్ సమీపంలో కల్పదరు ప్రాజెక్టులో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి రియాకుమారిని వెస్ట్ బెంగాల్ కు చెందిన సైకో హేమ్ బ్రోమ్… pic.twitter.com/tLyuH4a6j9
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2025