HomeTelanganaRevanthredy: నెలరోజుల్లో గ్రూప్ - 2,3 నియామకాలు పూర్తి చేస్తాం: సీఎం

Revanthredy: నెలరోజుల్లో గ్రూప్ – 2,3 నియామకాలు పూర్తి చేస్తాం: సీఎం

Published on

spot_img

హైదరాబాద్ : నెల రోజుల్లో గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన “ప్రజాపాలనలో కొలువుల పండగ” కార్యక్రమంలో ఆయన పాల్గొని “బిల్డ్ నౌ పోర్టల్”ను ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కారుణ్య నియామకాలు క్రమం తప్పకుండా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

గత పదేళ్లలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం వల్ల పదేళ్లు నష్టపోయారని, జాబ్ క్యాలెండర్ తోపాటుగా కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందేనని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర మరువలేనిదని, స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని అన్నారు. పేదలు, బడుగు,బలహీన వర్గాల వారే పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని, నిరుద్యోగుల బాధలను ప్రజాప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. అందుకే ఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలిచ్చామని అన్నారు సీఎం.

నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కారుణ్య నియామకాల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. నిరుద్యోగుల బాధలు తనకు తెలుసన్న సీఎం రేవంత్ రెడ్డి…ఉద్యో్గ ఖాళీలను పెండింగ్ పెట్టొద్దని ఆదేశాలిచ్చానన్నారు. 30,40 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగాలిచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయిని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...