హైదరాబాద్: బెట్టింగ్స్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ యాప్ లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ సినీ యాక్టర్స్ పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయోన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు.
సినీ ప్రముఖుల్లో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ ఉండగా.., సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లలో అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ కు చెందిన ప్రమోద్ శర్మ ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.