HomeWHEATHERSUMMER: 40 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు

SUMMER: 40 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు

Published on

spot_img

SUMMER: మార్చిలోనే ఉండలేకపోతున్నాం. ఇంక ఏప్రిల్, మే పరిస్థితి..ఊహించుకుంటుంటే భయం పుడుతోంది. కాలు బయటపెట్టగలమా? వెంట కచ్చితంగా పాకెట్ ఫ్యాన్, గొడుగు ఉండాల్సిందేనా? ఇంత ఎలివేషన్ దేనికీ అనుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమైపోయింటుంది.

బాబోయ్..ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 దాటాక బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. సూర్యుడు..సుర్ సుర్ అంటున్నాడు. వేడి గాలులు..సెగలు కక్కుతున్నాయి. ఉక్కపోత ఊపిరాడనివ్వట్లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే..ముందున్న 2 నెలలు మాడిపోతామేమో. అంతలా ఎండలు భయపెట్టిస్తున్నాయి. ఈ 3 నెలలు కాస్త వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు..జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నార్మల్ గా 30 డిగ్రీలు ఉంటేనే వేడిని తట్టుకోలేం. అలాంటిది..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. రానున్న 2 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీలు నమోదవుతోందని చెబుతున్నారు.

ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది.

అటు ఏపీలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. విజయవాడ, గుంటూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్, మే పరిస్థితి తలుచుకుని బెంబేలెత్తిపోతున్నారు. నీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest articles

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...

ATM IN TRAINS: రైళ్లో….ఏటీఎం ..!

ఇప్పటి వరకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పెద్దపెద్ద కార్యాలయాల్లో...ఏటీఎం సేవలను వినియోగించుకుంటున్నాం, కానీ త్వరలో కదిలే ఏటీఎంలు కూడా అందుబాటులోకి...

More like this

SUPREME COURT: కంచ గచ్చిబౌలిలో… చెట్లను కొట్టివేసే ముందు అనుమతి ఉందా..?…లేదా..?

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టింది. చెట్లను కొట్టేసే ముందు...

UKRAINE: టిక్‌టాక్‌ చూసి రష్యా సైన్యంలో చేరిన… చైనా పౌరుడు

డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు... ఆ డబ్బు ఎక్కడ దొరికితే... అక్కడికి వెళ్లుతున్నారు , ఆ డబ్బు కోసమే రష్యా...

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా... తృటిలో...