HomeNationalMaharastra: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు?

Maharastra: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు?

Published on

spot_img

* నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం
* పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ
* ఫలితాలొచ్చి 9 రోజులైనా సీఎం అభ్యర్ధి అంశంపై ఆలస్యం

మహారాష్ట్ర సీఎం అభ్యర్ధిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ, సీఎం పదవి ఎవరు చేపట్టాలన్న అంశం కారణంగా ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. దీనిపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించడంతో ప్రభుత్వ ఏర్పాటు ఓ కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం ఇద్దరు పరిశీలకులను నియమించింది.

మహారాష్ట్ర బీజేపీ ఎల్పీ పరిశీలకులుగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీలను ప్రకటించారు. వీరిద్దరూ ముంబయి వెళ్లి మహారాష్ట్ర నూతన ప్రభుత్వ ఏర్పాటును పర్యవేక్షించనున్నారు. మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపుగా ఖరారైంది.

నూతన సీఎం బీజేపీ నుంచే వస్తారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఇప్పటికే తమ వైఖరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ పేరును ప్రకటించడం లాంఛనం కానుంది.

గురువారం నాడు ప్రమాణస్వీకారోత్సం ఉంటుందని తెలుస్తోంది. ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను ఇవాళ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయస్థాయి అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...