బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రతో రూపొందించిన త చిత్రం ‘ఎమర్జెన్సీ’.
ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన మణికర్ణిక ఫిల్మ్స్, ప్రముఖ ప్రసార సంస్థ నెట్ఫ్లిక్స్పై ఒప్పంద ఉల్లంఘన, పరువు నష్టం దావా వేశారు సీనియర్ జర్నలిస్టు, రచయిత కూమి కపూర్. ఆమె రచించిన ‘ఎ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగానే ఈ సినిమా రూపొందించడానికి ఒప్పందం కుదిరింది. కానీ ఉద్దేశపూర్వకంగానే తన అనుమతి లేకుండా తన పేరును, తన పుస్తకాన్ని సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు.
ఈ పుస్తక హక్కులను కొనుగోలు చేసేటప్పుడు…. రచయిత అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆమె పేరు, పుస్తకాన్ని ఉపయోగించకూడదని ఒప్పందంలో పేర్కొన్నాం. నేను గోవాలో ఉన్నాను. స్క్రిప్ట్ను చూడలేకపోయాను. వాళ్లు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తారు అనుకున్నా…. కానీ వాళ్లు ఉల్లఘించారు. ఈ సినిమా ‘ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ’ అనే పుస్తకం ఆధారంగా రూపొందిందని ప్రచారం చేశారు. వారికి లీగల్ నోటీసులు పంపించినప్పటికీ వారి నుంచి ఎలాంటి సమాధానం లేదు అని అన్నారు. అందువల్లనే నిర్మాతలు, నెట్ఫ్లిక్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు.