గోవులు అంటే కేవలం జంతువులే… కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్ నేత
సుబ్రమణ్యస్వామి అన్నారు . టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతుున్నాయన్నారు. తిరుమలలోని గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం లేపాయి.
ఈ అంశంపై… ఒకపైపు కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా….గోవుల మృతిపై తాను కోర్టును ఆశ్రయిస్తానని సుబ్రమణ్యస్వామి ప్రకటించి మరింత హీట్ పెంచారు.
రాజ్యాంగంలో గోవులకు ప్రత్యేక స్థానం వుందని…గోవు అంటే కేవలం జంతువు మాత్రమే కాదని… కోట్లాది మందికి దైవమని సుబ్రమణ్యస్వామి అన్నారు. గోవుల ఆలనాపాలన పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు.
వయసు మళ్లడం వల్లే గోవులు చనిపోతున్నాయని టీటీడీ చెప్పడం యాజమాన్యం నిర్లక్ష్యానికి అద్దంపడుతుందని అన్నారు. వయసు మళ్లారని మీ కుటుంబ సభ్యులను కూడా వదిలేస్తారా..? అని స్వామి ప్రశ్నించారు. ఈ అంశంపై కోర్టులో కేసులు వేస్తానని చెప్పారు.