HomeCrimeCRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా...!

CRIME NEWS: విద్యార్థులపై విషప్రయోగమా…!

Published on

spot_img

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొందరు దుండగులు విద్యార్థులపై విషప్రయోగానికి ప్రయత్నించగా… తృటిలో ప్రాణాపాయం నుంచి విద్యార్థులు భయటపడ్డారు. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా చల్లారు. సిబ్బంది అప్రమత్తతతో స్కూల్‌లోని 30 మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలో వంట గదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగు నీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన స్థానికులు దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వారిని
తక్షణమే పట్టుకొవాలని….దీన్ని గమనించిన స్కూల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పిల్లల తల్లిదండ్రులు

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...