HomeAndhra PradeshCHANDRABAU: ‘అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను’ మళ్లీ ప్రారంభిస్తాం: సీఎం

CHANDRABAU: ‘అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను’ మళ్లీ ప్రారంభిస్తాం: సీఎం

Published on

spot_img

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా… సీఎం చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…అంబేడ్కర్‌ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన పర్యటించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ పోరాడారు. రాజ్యాంగంలో హక్కులను అంబేడ్కర్‌ పొందుపరిచారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ తెదేపా అని తెలిపారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చాం. సొంతూరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారన్నారు.

ప్రతిష్ఠాత్మక వర్సిటీలు అమరావతికి తరలివస్తున్నాయి. సబ్‌ప్లాన్‌ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తాం. రెసిడెన్షియల్‌ స్కూళ్లలో మెరుగైన భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. దళితులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. వారికి 8 లక్షల ఎకరాలను తెదేపా ప్రభుత్వం గతంలో పంపిణీ చేసింది… అని చంద్రబాబు గుర్తుచేశారు. .

 

Latest articles

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

More like this

Nizamabad : తమ భూమిని కబ్జా చేసిన నిందితుడిని శిక్షించాలని ధర్నా..

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో పర్స లింబాద్రికి చెందిన భూమిని పాస్టర్ చొక్కo ఇజ్రాయెల్ కబ్జా చేయడంపై...

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...