PETRO,DIESEL:ఊగిసలాటలో పెట్రోల్, డీజిల్ ధరలు…..
దేశవ్యాప్తంగా…. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. దీనివల్ల సాదారాణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి. ఈ పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి అని కేంద్ర ఒక ప్రకటనలో వెల్లడించినప్పటికీ….మరో వైపు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో ఎలాంటి పెరుగుదల ఉండదని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాన్ని ఆయిల్ కంపెనీలే భరిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దు అని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. దీంతో ధరలు పెరుగుతాయా….? లేదా అనేది చూడాలి మరి….
పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13కి పెరిగింది. డీజిల్పై లీటరుకు రూ. 10కి పెరిగింది. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం అనేది దేశంలోని వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్ష పన్ను. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి లేదా దిగుమతి సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీల నుంచి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆదాయవనరుగా చెప్పుకోవచ్చు. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ ప్రతీకార సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది.