HomeAndhra PradeshRAJAMAHENDRAVARAM: నమ్మించి గొంతుకోశాడు: ఫార్మసీ విద్యార్థి

RAJAMAHENDRAVARAM: నమ్మించి గొంతుకోశాడు: ఫార్మసీ విద్యార్థి

Published on

spot_img

 

లైంగిక వేధింపులకు గురై, ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఫార్మసీ విద్యార్థిని (23) పన్నెండు రోజులుగా.. మ‌ృత్యువుతో పోరాడి తనువు చాలించింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన యువతి రాజమహేంద్రవరం సమీపంలోని ఫార్మా కళాశాలలో చివరి ఏడాది చదువుతుంది. శిక్షణ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే దువ్వాడ మాధవరావు దీపక్‌ అనే వ్యక్తి ఆమెను నమ్మించి లైంగికంగా వేధించి మోసగించాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి నా గొంతు కోశాడు…. నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి…. అంటూ లేఖ రాసిపెట్టి, గత నెల 23న ఆసుపత్రిలో అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు. 12 రోజులుగా అదే ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.

తమ బిడ్డను మోసగించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అని బాధితురాలి తండ్రి కన్నీటిపర్యంతమ్యారు . ప్రభుత్వం, ఆసుపత్రి వైద్యుల నుంచి మాకు పూర్తి సహాయ సహకారాలందాయి కానీ మా బిడ్డ దక్కలేదన్నారు.

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...