HomeTelanganaTelangana: మెడికల్, నర్సింగ్ కళాశాల హాస్టళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి...

Telangana: మెడికల్, నర్సింగ్ కళాశాల హాస్టళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి…

Published on

spot_img

* వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాలలోని హాస్టళ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య, ఆరోగ్య , ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుతో కలిసి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో DMHO, TGMSIDC ఇంజనీరింగ్ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్, సంబంధిత శాఖల అధికారులతో వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నిర్మాణం పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తరగతి గదుల నిర్మాణం, అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆందోల్ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణంతోపాటు విద్యార్థుల వసతి గృహం నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆందోల్ ను మెడికల్ హబ్ గా రూపొందించడంలో భాగంగా వట్పల్లి, కంకోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం పనులు వెంటనే పూర్తిచేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి సూచించారు.

 

Latest articles

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...

NISSAN: AIతో… డ్రైవర్‌లెస్‌ కార్లు..

ప్రముఖ వాహనాల తయారీ సంస్థ నిస్సాన్‌ మరికొద్ది రోజుల్లో .... డ్రైవర్‌ లెస్‌ కార్లను తీసుకరావలని భావిస్తుంది. మార్కెట్లో...

More like this

CHIKKADAPALLY: డాక్యుమెంట్ రైటర్ ల నిరసన…

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ... శనివారం (19.04.25 ) రోజున చిక్కడపల్లి సబ్...

NAGAR KURNOOL: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయం: డాక్టర్ మల్లు రవి

గురువారం (17.4.2025) తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో.... పరిశ్రమలపై జరిగిన స్టాండింగ్ కమిటీలో....నాగర్ కర్నూల్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర...

SUPREME COURT: దంపతులిద్దరూ….కూర్చొని మాట్లాడుకోవాలి : ఒమర్‌ అబ్దుల్లా విడాకుల కేసులో…

జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు ఇప్పించాలని కోరుతూ... సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు...