HomeCrimeCrime News: ప్రియుడిపై మోజుతో పిల్లలకు విషంపెట్టి చంపిన తల్లి!

Crime News: ప్రియుడిపై మోజుతో పిల్లలకు విషంపెట్టి చంపిన తల్లి!

Published on

spot_img

* అమీన్ పూర్ లో ఓ తల్లి ఘాతుకం

* ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్న ఓ తల్లి ఆమె ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపేసింది. పోలీసుల విచారణలో బయటపడిన వాస్తవాలు పరిశీలిస్తే… రాఘవేంద్ర కాలనీకి చెందిన రజిత (45) అనే మహిళకు భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలు.. సాయికృష్ణ(12), మధు ప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు. ఇటీవల టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో తన పాత స్నేహితుడితో రజితకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతే.. భర్త, పిల్లలను వదిలించుకుని ప్రియుడితో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది.

మార్చి 27వ తేదీ రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగు అన్నంలో విషం కలిపింది. అయితే, ఆ అన్నం తినకుండా భర్త వాటర్ ట్యాంకు తీసుకుని కాలనీలో వాటర్ సప్లై చేసేందుకు వెళ్లిపోయాడు.దీంతో ఆ పెరుగు అన్నం ముగ్గురు పిల్లలకు పెట్టింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త చెన్నయ్య ఇంటికి వచ్చే సరికి ముగ్గురు పిల్లలూ విగత జీవులుగా పడివున్నారు. కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు.

ఈ వ్యవహారంలో మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు… మరింత లోతుగా కేసు విచారణ జరిపితే రజిత భాగోతం బయటపడింది. దీంతో రజిత ప్రియుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లలను తల్లి రజిత చంపేసిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది.

Latest articles

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...

TML: కారులలో ఊపిరాడక ఏడుస్తున్న పిల్లలను……సమయస్పూర్తితో…రక్షించిన తిరుమల పోలీసులు

కారు డోర్ లాక్ కావడంతో.... ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను రక్షించిన ఘటన తిరుమలలో జరిగింది. వైఎస్సార్‌ జిల్లా...

More like this

CHARMINAR : వారసత్వ హోద దక్కకపోవడానికి కారణం దాని చుట్టూ అక్రమ కట్టడాలే : వేదకుమార్

చుట్టూ ఉన్న అక్రమ కట్టడాల వల్ల చార్మినార్ కు వారసత్వ హోదా దక్కడం లేదని... డెక్కన్ హెరిటేజ్ అకాడమీ...

TIRUMALA: ఆవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి

గోవులు అంటే కేవలం జంతువులే... కాదని, వాటి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి అని బీజేపీ సీనియర్...

Hyderabad: అమ్మ రాసిన గీతే ….తల రాత అయింది

కంచె చేను మేస్తే కాసేదెవరన్నట్లు... పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే... కర్కశత్వానికి ఒడిగడితే...ఆ పిలల్లకు చెప్పుకోవడానికి దిక్కెవరు...